ప్రారంభమైన వైష్ణ‌వ్ మూడో చిత్రం..హీరోయిన్ ఎవ‌రంటే?

`ఉప్పెన‌` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్.. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రెండో చిత్రం కూడా పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

 మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ ఓ చిత్రంలో నటించ‌గా.. ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇక మ‌రోవైపు నాగార్జున కూడా వైష్ణ‌వ్‌తో ఒక సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. Photo : Twitter

ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఇక వైష్ణ‌వ్ తేజ్ త‌న మూడో చిత్రాన్ని అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ డైరెక్ట‌ర్ గిరీష‌య్య తో చేయ‌నున్నాడ‌ని గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ను నిజం చేశాడు వైష్ణ‌వ్‌.

 చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. Photo : Twitter

ఈ చిత్రం హైద‌రాబాద్‌లోనే ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా ఉత్తరాది భామ కేతిక శర్మ న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం సినిమా ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.‌

 ఇక వైష్ణవ్ తేజ్ క్రిష్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కించాడు క్రిష్. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.  Photo : Twitter