మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..`స‌ర్కార్‌..` టీజ‌ర్‌పై క్రేజీ అప్డేట్‌!

టాలీవుడ్ సైప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న యువ నటి స్వప్నిక సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ముచ్చటించారు.

ఈ క్ర‌మంలోనే ఎన్నో విష‌యాలు పంచుకున్న స్వప్నిక‌.. మే 31న స‌ర్కారు వాటి పాట టీజర్ ఉండొచ్చేమో అంటూ రెండు సార్లు చెప్పి చెప్పినట్టే హింట్ ఇచ్చారు. దీంతో మ‌హేష్ అభిమానులు టీజ‌ర్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. మ‌రి నిజంగానే స్వ‌ప్నిక చెప్పిన‌ట్టు మే 31న టీజ‌ర్ వ‌స్తుందో లేదో చూడాలి.‌‌‌‌