ఆ హిట్ సినిమాకు సీక్వెల్ చేయ‌బోతున్న ర‌వితేజ‌?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రాజా ది గ్రేట్`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రంలో ర‌వితేజ అంధుడిగా న‌టించారు. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు అనిల్ రావిపూడి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం `ఎఫ్ 2` సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్ రావిపూడి.. రీసెంట్ గా రవితేజను కలిసి రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ కి కథ చెప్పాడట.

కథ సూపర్ గా ఉండటంతో వెంటనే ర‌వితేజ ఓకే చెప్పేశాడని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం ఖ‌లాడి చేస్తున్న ర‌వితేజ‌.. ఆ త‌ర్వాత త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇవి పూర్తి అయిన త‌ర్వాత రాజా ది గ్రేట్ సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.