చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాలకు పాకేసి ముప్పతిప్పులు పెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెకెండ్ వేవ్లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుండడంతో.. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటి వరకు ప్రదీప్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ఈటీవీ ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో లలో యాంకర్ గా చేస్తున్నాడు ప్రదీప్. ఇప్పుడు ఆ షోస్లో ప్రదీప్ కాకుండా రవి హోస్ట్గా కనిపించాడు. ప్రదీప్కు కరోనా సోకడం వల్లే.. ఆయన ప్లేస్లో తాత్కాలికంగా రవి యాంకర్గా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.