యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్తో `ఆదిపురుష్`, కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో `సాలర్` మరియు నాగ్ అశ్విన్తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాడు.
అంతేకాదు.. సలార్, ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లాడు. అయితే తాజా సమాచారం ప్రకారం..మరో ప్రాజెక్ట్ను ప్రభాస్ లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చేయబోతున్నారు.
ఇటీవల ఆదిపురుష్ సినిమా షూటింగ్ లొకేషన్కి వెళ్లిన సిద్ధార్థ్ ఆనంద్.. అక్కడ ప్రభాస్కు క్లుప్తంగా కథ చెప్పారట. సిద్ధార్థ్ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చాడని అంటున్నారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ వినిపిస్తోంది. మరియు త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన రానుందని సమాచారం.