గుడ్‌న్యూస్ చెప్పిన ప‌వ‌న్‌..ఆనందంతో గాల్లో తేలుతున్న ఫ్యాన్స్‌!

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న క‌రోనా.. ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఎంద‌రో సెల‌బ్రెటీలు క‌రోనా బారిన ప‌డ‌గా.. ఇటీవ‌లె ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా సోకింది.

పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో ఆయ‌న అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గ‌ర‌య్యారు. ప‌వ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానుల‌తో పాటు సినీ తార‌లు కూడా కోరుకున్నారు. దీంతో తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

ఇక అన్నట్లుగానే ఆయనకు తాజాగా కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు నెగటివ్ వచ్చినట్లు తెలిసింది. ప‌వ‌న్ కోలుకోవ‌డంతో ఆయ‌న‌ అభిమానులు ఆనందంతో గాల్లో తేలిపోతున్నారు.‌