ప్రస్తుతం ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నాయి.
ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందర్లోనూ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ చిత్రాన్ని కొరటాల శివ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో పవర్ ఫుల్ కథతో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు కొరటాల. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మళ్లీ పొలిటికల్ బ్యాక్డ్రాప్నే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.