టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత రాజకీయాల వలన కొన్నాళ్లు సిని ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్గా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నారు. 13 ఏళ్ల తర్వాత కూడా విజయశాంతికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే రీఎంట్రీలోను విజయశాంతి ఆచితూచి సినెమలి ఎంపిక చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో విజయశాంతి ఒక కీలక పాత్ర పోషిస్తుందని తాజా సమాచారం. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారట. ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబ్బటి త్వరలోనే ఎన్టీఆర్తో కలిసి ఒకే స్క్రీన్ షేర్ చేసుకోనున్న రాములమ్మ.