తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయానికి కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతూ ఉన్న తరుణంలో దర్శనాల సంఖ్య బాగా తగ్గించింది టిటిడి. అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వ దర్శనం టోకేన్లను ప్రస్తుతం కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా సరే భక్తుల నుండి స్పందన బాగా తగ్గిపోయింది.
ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల మేరకు టిటిడి ఆధ్వర్యంలోని ఒంటిమిట్ట, శ్రీనివాస మంగాపురం ఆలయాలను మూసి వేసింది టిటిడి. ఇంకా ప్రస్తుతం ఏపీలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 955455 కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 40469 గా ఉన్నాయి. ఇప్పటి వరకు 907598 మంది కరోనా నుండి రికవరీ కాగా 7388 మంది కరోనా కారణంగా చనిపోయారు.