అర‌రే..మ‌రీ అంత త‌క్కువా..అస‌హ‌నంలో అన‌సూయ ఫ్యాన్స్‌!

యాంక‌ర్ అన‌సూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని క‌రోనా కార‌ణంగా థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రం మే 7న స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి త‌రుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాను ఆహా 1.8 కోట్లకు కొన్నట్లు ప్ర‌చారం జ‌రిగింది. అంటే కనీసం రెండు కోట్లు కూడా పలకలేదు. పోస్టర్లు, ట్రైల‌ర్‌తోనే సినిమాపై మంచి అంచ‌నాలు పెరిగాయి. మ‌రి అలాంటి సినిమాను అంత తక్కువ ధ‌ర‌కే ఎలా అమ్మార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు అనసూయ అభిమానులు. అయితే నిజంగానే థ్యాంక్ యు బ్రదర్ చిత్రాన్ని అంత త‌క్కువ రేట్‌కు అమ్మారా..లేదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది.