నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదే చివరి షెడ్యూల్. పతాక సన్నివేశాల్లో కొంత భాగం, హీరో హీరోయిన్లపై ఓ పాట తెరకెక్కించనున్నారట. ఇందులో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సహా ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది.
ఇక జస్ట్ టూ వీక్స్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కరోనా కోరలు చాస్తున్నప్పటికీ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మంది సిబ్బందితో ఈ షెడ్యూల్ పూర్తి చేయనున్నారట. షూటింగ్ పూర్తి అవుతుండడంతో..సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని బాలయ్య ఫ్యాన్స్ ఎగ్జైట్గా ఉన్నారు. కాగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.