టాలీవుడ్లో ఇప్పుడు నాని వరుస హిట్లతో పెద్ద హీరోలకు సవాల్ విసురుతున్నాడు. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో స్టార్ట్ అయిన నాని హిటగ్ ట్రాక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసగా ఏడు హిట్లు కొట్టిన నాని ఇప్పుడు ట్రిబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకువెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో వారస హీరోలు నాని హిట్ ట్రాక్ చూసి కుళ్లకుంటున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్ – నిన్ను కోరి సినిమాలతో హిట్ కొట్టిన నాని ఇప్పుడు డిసెంబర్లో ముచ్చటగా ఏంసీఏ సినిమాతో మూడోసారి థియేటర్లలోకి దిగుతున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ మూడో వారంలో వస్తోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ స్టార్ హీరోలకు దిమ్మతిరిగిపోయే రేంజ్లో జరుగుతోంది.
ఏంసీఏ – మిడిల్ క్లాస్ అబ్బాయి బిజినెస్ ఓవరాల్గా థియేట్రికల్ రైట్స్ + డిజిటల్ రైట్స్ + శాటిలైట్ రైట్స్ కలుపుకుని రూ.40 కోట్ల వరకు చేసినట్టు తెలుస్తోంది. నాని సినిమాలన్ని ఇప్పటి వరకు రూ.25 కోట్లకు మించిన బిజినెస్ ఎప్పుడూ చేయలేదు. అయితే ఇప్పుడు ఏంసీఏకు మంచి బజ్ ఉండడంతో ఏకంగా రూ.40 కోట్ల బిజినెస్ చేయడంతో స్టార్ హీరోలు సైతం షాక్ అయిపోతున్నారు.
నాని నేను లోకల్ రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఏంసీఏ సినిమాకు నిర్మాత దిల్ రాజు రూ.18 కోట్ల బడ్జెట్ పెట్టగా రూ.2 కోట్ల ప్రమోషన్తో కలుపుకుని రూ.20 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇప్పుడు రూ.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో రిలీజ్కు ముందు రాజుకు భారీ లాభాలు వచ్చాయి.