యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. శుక్రవారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ – లావణ్య త్రిపాఠి – అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా రిలీజ్కు ముందే మంచి బజ్ తెచ్చుకుంది. నేను శైలజ తర్వాత రామ్ – తిరుమల కిషోర్ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు, టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకు వరల్డ్వైడ్గా రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.6 కోట్లు – సీడెడ్లో రూ.3 కోట్లు – ఆంధ్రాలో రూ. 7 కోట్ల బిజినెస్ ఈ సినిమా చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని రూ. 2 కోట్ల బిజినెస్ చేసింది. ఈ ప్రి రిలీజ్ బిజినెస్తో నిర్మాత రిలీజ్కు ముందే సేఫ్ జోన్లోకి వచ్చేశాడు.ఇక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడడమే మిగిలి ఉంది.
నేను శైలజ సినిమా రామ్ కెరీర్లోనే హయ్యస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఓవర్సీస్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. నేను శైలజ లాంగ్రన్లో రూ.30 కోట్ల వరకు షేర్ కొల్లగొట్టింది. మరి ఉన్నది ఒక్కటే జిందగీ ఏం చేస్తుందో ? శుక్రవారం తేలిపోనుంది.