సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్లో వస్తోన్న 2.0 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధికంగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా దుబాయ్లో కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లినప్పటి నుంచి ఏదో ఒక వార్తతో సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా గురించి మరో హాట్న్యూస్ బయటకు వచ్చింది. శంకర్ సినిమాల రన్ టైమ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. శంకర్ ఐ సినిమా రన్ టైం కూడా 180 నిమిషాలకు పైగానే ఉంది.
అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సినిమాల రన్ టైం తక్కువగా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2.0 రన్ టైంను శంకర్ బాగా తక్కువుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2.0 రన్ టైం 140 నిమిషాలు మాత్రమే ఉంటుందట. హాలీవుడ్ సినిమాలు కూడా 120 నిమిషాల లోపే ఉంటాయి. బహుశా శంకర్ కూడా అదే ఆలోచనతో ఈ సారి అంతే రన్ టైమ్లో 2.0ను చూపించాలని ప్లాన్ చేశాడట.
ఇదిలా ఉంటే ఈ సినిమాను ముందుగా జనవరి 25న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా లేట్ అవ్వడంతో వచ్చే సమ్మర్కే 2.0 థియేటర్లలోకి వస్తుందని తెలుస్తోంది.