ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ప్రశంసలు కురిపించాడు. జగపతిబాబు విలన్గా నటించిన లేటెస్ట్ మూవీ జయ జానకీ నాయక సక్సెస్ మీట్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని హంసలదీవిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర సిబ్బంది, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఓ ఫైట్ను హంసలదీవి వద్ద చిత్రీకరించారు. ఇది సినిమాకే మేజర్ హైలెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఎపిసోడ్తో పాటు కృష్ణా నది విశిష్టతను తెలుపుతూ వచ్చిన పాట కూడా అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమాను రిలీజ్ రోజునే అవనిగడ్డ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ వీక్షించి హసంలదీవి విశిష్టతను తెలియజేసిన ఈ సినిమా యూనిట్ను మెచ్చుకున్నారు.
తాజాగా హంసలదీవిలో జరిగిన సక్సెస్ మీట్లో జగపతి బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ను మెచ్చుకున్నారు. బుద్ద ప్రసాద్ను ఉద్దేశించి మాట్లాడిన జగపతి.. చాలా రోజులు తర్వాత ఒక జెంటిల్మెన్ను చూశాను.. అందరు ఎమ్మెల్యేలూ ఇలాగే ఉంటే బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్, కలెక్టర్కు ఆయన నమస్కరించారు.
ఇక బుద్ధప్రసాద్ తెలుగు భాషా పరిరక్షణ కోసం బాగా కృషి చేస్తుంటారు. ఆయనకు దివిసీమ ప్రాంతంలో మంచి పేరుంది. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఆయన గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ చేసి ఇక్కడ కూడా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.