ఇప్పుడు తెలుగు మీడియాలో పేపర్లు చూసినా, టీవీ ఛానెల్స్ చూసినా డ్రగ్స్ గురించిన వార్తలే పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. పేపర్ తిరగేసినా, ఛానెల్ మార్చినా డ్రగ్స్ వార్తలే కనిపిస్తున్నాయి. ఇక తాజాగా డ్రగ్స్ ఉదంతంతో సిట్ బుధవారం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిని రోజుకు ఒకరి చొప్పున విచారణ ప్రారంభించింది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న మమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్లో ఉండడంతో ఆమెకు మినహాయింపు లభించవచ్చని తెలుస్తోంది.
ఇక బుధవారం విచారణకు హాజరైన పూరిని తెలుగు మీడియా ఓ ఆటాడుకుంది. ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పలేదు. ఇక పోలీసులు కూడా పూరీ గురించి ఏం చెప్పలేదు. కానీ మీడియా మాత్రం పూరీని దోషిగా భావిస్తూ బోను ఎక్కించేసింది. ఇక ఎలక్ట్రానిక్ మీడియా టీఆర్పీ రేటింగ్స్ కోసం మరి బరి తెగించేసింది. పూరి ఫ్యాన్స్ను ముందు పెట్టుకుని పూరీ మీద పదే పదే ప్రశ్నల వర్షం కురిపించేసింది.
పూరీ విచారణకు హాజరయ్యాడు ? మీ ఫీలింగ్ ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. లోపల ఏం జరుగుతుందో ? వాళ్లకు మాత్రం ఏం తెలుసు. ఓవరాల్గా పూరీ పేరును మీడిమా ఓ ఆటాడుకుంది. కానీ ఇక్కడ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి నానా రచ్చ రచ్చ చేసి ఉన్నది లేనిది కలిపేసి ఊదరగొట్టేశారు. ఈ విచారణకు పూరీ వస్తేనే ఇంత హడావిడి చేశారంటే ఇక రవితేజ, చార్మీ లాంటి వాళ్లు వస్తే మీడియా వాళ్ల కవరేజ్తో పిచ్చెక్కించేస్తారేమో..!