రాజీకొచ్చిన నంద‌మూరి బ్ర‌ద‌ర్స్‌..?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై ల‌వ‌కుశ‌. ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. టీజ‌ర్ రిలీజ్ అయినప్ప‌టి నుంచే జై ల‌వ‌కుశ సినిమాలో జై క్యారెక్ట‌ర్‌పై కాంట్ర‌వ‌ర్సీ స్టార్ట్ అయ్యింది.

గ‌తంలో పూరి జ‌గ‌న్నాథ్ ఎన్టీఆర్‌కు చెప్పిన ఓ క‌థ‌లో ఓ క్యారెక్ట‌ర్‌కు నెగిటివ్ షేడ్‌తో పాటు న‌త్తి ఉంటుంద‌ని, ఇప్పుడు అదే క్యారెక్ట‌ర్ నుంచి జై ల‌వ‌కుశలోని జై క్యారెక్ట‌ర్‌ను కాపీ కొట్టారంటూ పూరి ఫైర్ అవుతోన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వివాదంపై అటు ఎన్టీఆర్‌, ఇటు పూరి ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. పూరి కథనే ఎన్టీఆర్ కాపీ కొట్టాడంటూ లీకైన న్యూస్ వెనుక పూరి ఫ్రెండ్ ఛార్మి ఉన్నట్టు వార్తలు లీక్ అయ్యాయి.

ఇక ఈ ఇష్యూ సుఖాంతం అయ్యింద‌ని, దీని వెన‌క పూరి – ఎన్టీఆర్ రాజీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. నిర్మాత క‌ళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ – పూరి కూర్చుని ఈ వివాదాన్ని ఇక్క‌డితో ముగించార‌ట‌. జై ల‌వ‌కుశ సినిమా విష‌యంలో ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీలు రావ‌డం ఇష్టంలేని క‌ళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ పూరితో కూర్చుని ఈ కాపీ మేట‌ర్ సెటిల్ చేసేశార‌ట‌.

పూరికి తాను మ‌రో సినిమా చేసే ఛాన్స్ ఇస్తాన‌ని చెప్ప‌డంతో పూరి కూడా సైలెంట్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీనిని పెద్ద‌ది చేయ‌డం పూరికి కూడా ఇష్టం లేద‌ని… అందుకే ఆయ‌న మౌనంగా ఉన్నార‌ట‌. అందుకే ఈ మ్యాట‌ర్‌పై తాను ఎక్క‌డా మాట్లాడ‌న‌ని పూరి కూడా ఎన్టీఆర్‌కు మాట ఇచ్చాడ‌ట‌.