టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో రోజు రోజుకి కొత్త వ్యక్తుల పేర్లు బయటికొస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్ సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో నవదీప్ సోమవారం సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక చార్మి, రవితేజ, మమైత్ ఖాన్లు కూడా వరుసగా విచారణకు రానున్నారు.
ఈ విచారణల్లోనే షాకింగ్ విషయాలు వెల్లడి అవుతుంటే ఇప్పుడు మరో కొత్త సంచలనం జరిగింది. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్న కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా అతడిపై అనుమానంతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో పాటు అతడి ఇంట్లో పెద్ద మొత్తంలో గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇక అతడు డ్రగ్స్ వాడింది లేనిది తెలుసుకునేందుకు రక్తపరీక్షలు కూడా చేయనున్నారు. ఇక రోనీ గతంలో లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నా వంటి ఇతర స్టార్ హీరోయిన్లకు కూడా మేనేజర్ గా పనిచేశాడు. దీంతో ఆ ముగ్గురు పేర్లు కూడా ఈ ఇష్యూలో ఇన్డైరెక్టుగా తెరమీదకు వచ్చాయి. రోనీ ఎవరెవరి పేర్లు బయట పెడతాడో ? అని అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు.