గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయంతో మాంచి జోష్ తో ఉన్న నందమూరి బాలకృష్ణ వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న చేస్తున్నాడు , ఈ సినిమా కోసమే 45 రోజులపాటు పోర్చుగల్ వెళ్లబోతున్నాడు బాలయ్య. అంతకుముందే తను చేయబోయే 102వ సినిమా గురించి బాలయ్య అప్పుడే నిర్ణయం తీసుకొని పట్టాలెక్కించడానికి సిద్ధం అయిపోయాడు.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. జూన్ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నటసింహ బాలకృష్ణతోపాటు భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారట . రజనీకాంత్తో నరసింహ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్.రవికుమార్, నటసింహ బాలకృష్ణ ఫస్ట్ కాంబినేషన్లో మా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.