కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్రశ్నతో యావత్తు దేశాన్ని తన సినిమా కోసం వెయిట్ చేసేలా చేయించాడు దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి! సంచలన విజయాన్ని నమోదుచేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది బాహుబలి-2! ఈ సినిమా ద్వారా రాజమౌళి గురించి ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కంటే.. మరో ప్రశ్న అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అదే.. రాజమౌళి ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీస్తాడు? స్టార్ హీరోనా లేక చిన్న హీరోగా.. లేక తన కలల ప్రాజెక్టు మహాభారతమేనా? అనేది అందిరలోనూ సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే జక్కన్న.. టాలీవుడ్ సూపర్ స్టార్తో సినిమా చేస్తాడనే వార్త చక్కెర్లు కొడుతోంది.
బాహుబలి-2 విడుదలై రెండు వారాలు గడిచిపోయింద. దేశంలోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అన్ని రికార్డులు బాహుబలి సునామీలో కొట్టుకుపోతున్నాయి. దర్శక ధీరుడి ప్రతిభను వేనోళ్ల పొగుడుతున్నారు. ఇప్పుడు రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ హీరోగా సినిమా ఉంటుందని.. మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని.. రకరకాల వార్తలు ఫిల్మ్నగర్లో వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లో మరో వార్త కూడా చేరిపోయింది.
తాజాగా సమచారం ప్రకారం జక్కన్న తన నెక్ట్స్ సినిమాను మహేష్ హీరోగా రూపొందించాలని భావిస్తున్నాడట. చాలా కాలం క్రితమే మహేష్ బాబు హీరోగా కె.యల్. నారాయణ నిర్మాణంలో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో `స్పైడర్` సినిమాలో నటిస్తున్న మహేష్, తరువాత కొరటాల శివ దర్శకత్వంలో `భరత్ అనే నేను` సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.
ఇప్పటికే మహేష్ కోసం చాలా మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి ఊపిరి తర్వాత మహేష్ తేదీల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా లైన్లో ఉన్నాడు. మరి ఈ సమయంలో రాజమౌళి సినిమాను పట్టాలెక్కిస్తాడా లేదా అనేది ఇప్పుడు అనుమానాలు కలిగిస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టి రాజమౌళి సినిమాను ఓకె చేస్తాడా? అసలు విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే!