గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధాని పదవి చేరుకోవడానికి మోడీ ఎన్ని వ్యూహాలు రచించారో తెలిసిందే! తెరమీద ఆయన ఎంత కష్టపడ్డారో.. తెరవెనుక ఉండి ఈ వ్యూహాలను పక్కాగా అమలు చేసి అఖండ విజయాన్ని అందించిన వ్యక్తి!! ఏడాది తిరిగేలోగా.. అదే మోడీ హవాను తట్టుకుని.. బిహార్లో నితీశ్-లాలూ జోడీని పట్టాలెక్కించేలా చేసిన వ్యక్తి కూడా ఒకరే!! ఆయనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్!! ఆయన వ్యూహాలకు ఎదురులేదు.. ఆయన ఎటు ఉంటే అటే విజయం! అందుకే ఏపీ ప్రతిపక్ష నేత ఏరికోరి ఆయనతో భేటీ అయ్యారట. సీఎం కలను సాకారం చేసుకునేందుకు ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలో చర్చించారట.
ఏపీలో ముందస్తు కోడి కూసింది. రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు అలర్ట్ అవుతున్నాయి, ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమని ప్రకటించే స్తున్నాయి. అందుకు తగిన ప్రణాళికలు పక్కగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సమయంలో ప్రతిపక్ష నేత జగన్ సైలెంట్గా ఉంటారా? అందుకే 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలు వేయాలనే అంశంపై చర్చించేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ భూషన్తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది,
పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి – టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు రానున్నాయని శ్రేణులకు హింట్ ఇచ్చారు. ఆ వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ… ఒక వేళ ముందస్తు ఎన్నికలొస్తే జనసేన పార్టీ సిద్ధంగా ఉందని పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. దీంతో రెండేళ్లుండగానే ఏపీలో ఎలక్షన్ హీట్ మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఐక్యరాజ్యసమితి తరఫున ఆఫ్రికాలో ఆరోగ్య నిపుణుడిగా చేస్తున్నకిశోర్ .. ఉద్యోగం వదులుకుని 2011లో భారత్ కు వచ్చారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో – తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి అండగా నిలిచారు.
మోడీ కోసం చాయ్ పే చర్చ సహా పలు సృజనాత్మక ప్రచార వ్యూహాలను రూపొందించాడు. ఆ ఎన్నికల విజయం తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కిశోర్ను పక్కనపెట్టారు. కిశోర్ ప్రతిభ గుర్తించిన నితీశ్.. ప్రచారం కోసం సహాయం కోరారు. ప్రశాంత్ కిశోర్ ఓకే చేయడం మహాకూటమిని గెలిపించి…మోడీకి ఓటమిని రూచి చూపించడం తెలిసిందే! మరి ఆయన సలహాలు జగన్కు ఎంత వరకూ ఉపయోగపడతాయో వేచిచూడాల్సిందే!!