రాజ‌మౌళి నెక్ట్స్ 2 సినిమాల‌పై జాతీయ మీడియాలో క‌థ‌క‌థ‌లుగా వార్త‌లు

దర్శకధీరుడు రాజమౌళి దాదాపు ఐదేళ్లుగా ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలతోనే బిజీగా గడిపాడు. ఎప్పుడో ప్ర‌భాస్ మిర్చి సినిమా రిలీజ్ అయ్యాక 2013లో ప్రారంభ‌మైన బాహుబ‌లి సినిమా రెండు సంవ‌త్స‌రాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని ఎట్ట‌కేల‌కు 2015లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ముందుగా బాహుబ‌లి సినిమాను ఒక్క పార్ట్‌తోనే సరిపెట్టాల‌నుకున్న రాజ‌మౌళి క‌థ‌లోకి ఎంట‌ర్ అయ్యాక రెండో పార్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు.

ఇక బాహుబ‌లి ఊహ‌కే అంద‌ని విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఊహ‌ల్లోని అంచ‌నాల‌కే అంద‌కుండా బాహుబ‌లి 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాహుబ‌లి 2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. బాహుబ‌లి రెండో భాగం థియేట‌ర్ల‌లోకి రాకుండానే అప్పుడే రాజ‌మౌళి నెక్ట్స్ రెండు సినిమాల‌పై జాతీయ మీడియాలో క‌థ‌క‌థ‌లుగా వార్త‌లు వ‌చ్చేస్తున్నాయి.

బాహుబ‌లి 2 తర్వాత ‘మహాభారతం’ లేదా ‘గరుడ’ సినిమాలను రాజమౌళి ప్రారంభించబోతున్నట్టు జాతీయ మీడియా కూడా వార్తలు రాసింది. అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యాక రాజ‌మౌళి ఈ యేడాదంతా త‌న ఫ్యామిలీతో విరామం తీసుకుంటాడ‌ట‌. ఐదేళ్ల పాటు ఈ సినిమాకు ప‌నిచేసిన రాజ‌మౌళి ఈ యేడాదంతా ఫ్యామిలీతోనే గ‌డుపుతాడంట‌. ఆ త‌ర్వాత కొత్త ప్రాజెక్టును సెట్స్‌మీద‌కు తీసుకువెళ‌తాడ‌ని స‌మాచారం.