భారీ బ‌డ్జెట్‌తో ఓవ‌ర్ రిస్క్ చేస్తున్న చెర్రీ – సుకుమార్

మెగాప‌వ‌ర్ స్టార్ రాచంర‌ణ్ – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతోన్న షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం గోదావ‌రి జిల్లాల్లో వివిధ లొకేష‌న్ల‌ను స్పీడ్‌గా ఎంపిక చేస్తున్నారు. ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ ఆధారంగా ఈ సినిమా స్టోరీ లైన్ న‌డుస్తుంద‌ట‌. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రాంచ‌ర‌ణ్‌, సుకుమార్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

రెండు వ‌రుస ప్లాపుల త‌ర్వాత రాంచ‌ర‌ణ్ న‌టించిన ధృవ ఓ మోస్త‌రుగా ఆడింది. సినిమాకు హిట్ టాక్ వ‌చ్చినా లాభాలు మాత్రం రాలేదు. ఇక నాన్న‌కుప్రేమ‌తో సినిమాతో సుకుమార్ మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఈ సినిమాను రామ్ చరణ్ ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో బ‌డ్జెట్ పూర్తిగా లిమిట్స్ దాటేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ సింపుల్‌గా రూ. 70 కోట్లు అని లెక్క‌లేస్తున్నార‌ట‌. చివ‌ర‌కు ఇది రూ. 80 కోట్లు క్రాస్ అవుతుంద‌ని కూడా అంచ‌నా. ఈ సినిమా కోసం రాంచ‌ర‌ణ్, సుకుమార్ ఇద్ద‌రూ రేట్లు పెంచేశార‌ట‌.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ 15 కోట్లు, సుకుమార్ 8 కోట్లు తీసుకున్నార‌ట‌. ఇక స‌మంత‌కు 2 కోట్లు, జగపతిబాబు, రావు రమేష్, పృథ్వీలాంటి సీజన్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా భారీగానే ఖర్చు అవుతోంది. పైగా వాళ్ళందరి డేట్స్ కూడా చాలా ఎక్కువ రోజులు కావాలని సుకుమార్ అడుగుతున్నాడు. మొత్తంగా చూసుకుంటే కేవలం నటీనటులు, డైరెక్టర్ రెమ్యూనరేషన్లే 30 కోట్లు దాటేస్తున్నాయ‌ట‌.

ఇక దేవిశ్రీ, ర‌త్న‌వేలు, ఫైట్‌మాస్ట‌ర్స్ ఇలా అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్లే ప‌ని చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా 100 రోజుల‌కు మేకింగ్ బ‌డ్జెట్ రూ.30 కోట్లు ఖాయంగా క‌నిపిస్తోంది. చెర్రీ ఇప్ప‌టి వ‌ర‌కు (మ‌గ‌ధీర‌ను ప‌క్క‌న పెట్టేస్తే) ఒక్క ధృవ‌తో మాత్ర‌మే రూ.50 కోట్లు దాటాడు. అయినా ఆ సినిమాకు లాభాలు రాలేదు. మ‌రి ఇప్పుడు ఇంత బ‌డ్జెట్‌తో ఓవ‌ర్ రిస్క్ చేస్తున్నార‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.