గోపీచంద్ లౌఖ్యంతో పామ్లోకి వచ్చి సౌఖ్యంతో బాగా నిరాశ పరిచాడు. సౌఖ్యం సినిమా గోపీచంద్ కేరీర్ను ఎంతలా దిగజార్చింది అంటే రూ.20 కోట్లు ఆ సినిమాకు బిజినెస్ జరిగితే కోటి రూపాయల షేర్ కూడా రాలేదు. దీంతో గోపీచంద్తో సినిమా అంటేనే నిర్మాతలు, బయ్యర్లు జడుసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి.
రచ్చ – బెంగాల్ టైగర్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఈ యేడాది వస్తుందని అంటున్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఇక నయనతార హీరోయిన్ గా సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఎప్పుడు షూటింగ్ ఫినిష్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవ్వరికి తెలియడం లేదు. ఈ సినిమా దాదాపుగా నాలుగేళ్లుగా సెట్స్మీదే ఉంది.
ఇక జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆక్సీజన్’ షూటింగ్ సైతం ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా డైరెక్టర్ జ్యోతికృష్ణకు గోపీచంద్కు మధ్య విబేధాలు రావడంతో ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో గోపీకి చెప్పుకోవడానికి చేతిలో మూడు సినిమాలు ఉన్నా ఏ సినిమా ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియడం లేదు.