అఖిల్, విక్రమ్ కుమార్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది మల్టీస్టారర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. అయితే మల్టీస్టారర్ అంటే మరో స్టార్ ఎవరో అనుకునేరు. అది కింగ్ నాగార్జున. కొడుక్కి హిట్ ఇవ్వడం కోసం డైరెక్ట్గా నాగార్జునే రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో కనిపిస్తారట. ‘మనం’ సినిమాలో అఖిల్తో కలిసి నటించాడు నాగార్జున. అయితే అందులో అఖిల్ది గెస్ట్ రోల్. కానీ ఈ సినిమాలో ఇద్దరివీ ఈక్వెల్ రేషియో క్యారెక్టర్సట. ‘మనం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అంతటి సీనియర్ నటుడ్ని, నాగార్జున స్టార్డమ్ని, నాగ చైతన్య వంటి యంగ్ హీరోని ఎట్ ఏ టైమ్ మేనేజ్ చేసిన ఘనత విక్రమ్ కుమార్ది.
ఎవరి పరిమితుల్లో వారిని తక్కువ ఎక్కువ కాకుండా డీల్ చేశాడు. అలాంటిది అఖిల్ని హీరోగా ప్రమోట్ చేస్తూ, నాగార్జున స్టార్డమ్ని మెయింటెయిన్ చేయడమంటే మామూలు విషయం కాదు. మరి ఈ పెద్ద డీల్ని విక్రమ్ కుమార్ ఎలా చేస్తాడో చూడాలి. ఈ సినిమాలో అఖిల్కి జోడీగా మెహరీన్ కౌర్ నటిస్తోంది. నాగార్జునకు జోడీగా మరో సీనియర్ హీరోయిన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున రాఘవేంద్రరావు డైరెక్షన్లో ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హథీరామ్బాబా భక్తుడి పాత్రలో కనిపిస్తాడు నాగార్జున. ఆ సినిమా పూర్తి కాగానే విక్రమ్ సినిమాలో జాయిన్ అవ్వనున్నాడనీ ఫిల్మ్ నగర్ టాక్.