విశాల్ కి రాధిక సవాల్

కోలీవుడ్ లో నడిఘర్ సంఘం ఎన్నికలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.మాములు రాజకీయాలకి ఏ మాత్రం తీసిపోని ఎత్తులు,పైఎత్తులు,ఆరోపణలు,నిందలు..ఇలా ఒకటేమిటి సిసలైన రాజకీయ చదరంగాన్ని తలపించింది నడిఘర్ ఎన్నిక.ఆ ఎన్నికలయ్యాయి శరత్ బాబు ఓటమి పాలవగా విశాల్ కి అధికారం దక్కిన విషయం తెలిసిందే.

అయితే ఎన్నికలయి చాలా కాలం అయినా ఇంకా ఆ దూషణలు..కక్ష సాధింపు పర్వాలు మాత్రం ఆగడం లేదు.ఈ మధ్యనే శరతకుమార్‌, రాధారవి లు నడిగర్‌ సంఘంకు చెందిన రూ1.65 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ వారిని తొలగించి, వారిపై పోలీసు కేసు పెట్టేందుకు ఇటీవలే తీర్మానం చేసిన విషయం తెలిసిందే.శరత్ కుమార్ తో విశాల్ కి వ్యక్తిగత బంధుత్వం కూడా వుంది.స్వయానా శరత్ కుమార్ కుమార్తె వరలక్షి, విశాల్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తెలుస్తున్నారు.ఓవైపు మామపై కత్తిగట్టిన విశాల్ మరో వైపు కూతురు వారలక్షితో డ్యూయెట్స్ పడుతూ సిసలైన ఆరవ సినిమా చూపిస్తున్నాడు.

తాజాగా శరత్ కుమార్ సస్పెన్షన్ పై ఆయన సతీమణి,ఒకనాటి అందాల తార రాధిక తీవ్రంగా స్పందించారు.విశాల్ పై రాధిక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నీలో ఇంత ద్వేషం ఉందా.. ఇంతకు ముందు 100 కోట్లన్నావు.. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చావా.. ఆరోపణలున్న వ్యక్తుల వివరణ కూడా వినకుండా సస్పెండ్ చేసేంత ద్వేషం నీలో ఉందా.. ఈ మాటలన్నందుకు నన్ను కూడా సస్పెండ్ చేసేయ్ అంటూ రాధికా సోషల్ మీడియా లో విశాల్ పై ఫైర్ అయ్యారు.