టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ హిట్ జోష్లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ చిన్న విరామం తీసుకుంటున్నాడు. గ్యారేజ్ ఇప్పటికే రూ.120 కోట్ల గ్రాస్తో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్లగొట్టి ఇంకా దూసుకుపోతోంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో సహజంగానే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉంటాయి.
ఎన్టీఆర్ తర్వాత సినిమా కోసం నిన్నటి వరకు లింగుస్వామి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, వక్కంతం వంశీ అంటూ ఇలా చాలా మంది పేర్లే వినిపించాయి. ఈ జాబితాలో మనకు వినపడుతున్న లేటెస్ట్ టాక్ ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి పూరి జగన్నాథ్ పేరు ఫైనల్ అవుతుందన్న టాక్ వినపడుతోంది.
సైడ్ ట్రాక్లో ఉన్న ఎన్టీఆర్ కేరీర్ను పూరి టెంపర్ సినిమాతో పట్టాలెక్కించాడు. ప్రస్తుతం పూరి చెప్పిన లైన్ ఎన్టీఆర్కు బాగా నచ్చిందని..ఎన్టీఆర్ ఫుల్ స్టోరీతో రమ్మని చెప్పాడట. దీంతో కళ్యాణ్రామ్తో ఇజం సినిమాను తెరకెక్కిస్తోన్న పూరి ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి బ్యాకాంగ్ ఫ్లైట్ ఎక్కేశాడట. ఇక బ్యాకాంగ్లో పూరి స్టోరీ రెడీ చేస్తే చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
మరి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు సైతం అక్కడే స్టోరీ రెడీ చేస్తున్నాడు. అక్కడ ఫుల్ స్టోరీ రెడీ చేసుకుని..ఎన్టీఆర్ను ఎంత వరకు మెప్పిస్తాడో…ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందో ఉత్కంఠగానే ఉంది.