వినోద్ ని చంపింది ఎన్టీఆర్ అభిమానా?

ఇద్దరు వ్యక్తుల మధ్య తమ అభిమాన హీరోల పై వుండే వ్యామోహం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరి ప్రాణం బలిగొంది.వినోద్ రాయల్ ని కర్ణాటక రాష్ట్రం కోలార్ సమీపం లో హత్యకు గురయిన విషయం తెలిసిందే.అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏ విషయమై గొడవ మొదలైంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తిరుపతికి చెందిన వినోద్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.ఎంతగా ఆంటే ఓ చేతిపై పవనిజం అని ఇంకో చేతి పై అమ్మ అని పచ్చబొట్టు పొడిపించుకునేంతగా.అదే అభిమానంతో జనసేన సేవా కార్యక్రమాల్లో వినోద్ చురుగ్గా పాల్గొనేవాడు.అదే తరహాలో కర్ణాటకలోని కోలార్‌లో పవన్‌కల్యాణ్‌ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్యక్రమానికి వినోద్‌ హాజరయ్యాడు.ఆ తరువాత స్నేహితుల మధ్య పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ ల చర్చ మొదలైంది.అది చిలికి చిలికి మా హీరో గొప్ప ఆంటే మాహీరోని గొప్ప అనే రేంజ్ కెళ్ళింది.విచక్షణ కోల్పోయిన స్నేహితుల్లో ఒకడు పవన్ అభిమానిని ఒకే పోటు గుండెల్లో కత్తితో పొడవడం తో వినోద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

వినోద్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతిలో ఓదార్చాడు.ఈ సందర్బంగా తనకు ఏ హీరోలతోనూ గొడవలు లేవని,తనకే కాదు ఇండస్ట్రీ లో ఏ హీరోల మధ్య గొడవలుండవని.. కేవలం సినిమాల పరంగానే పోటీ తప్ప వ్యక్తిగతంగా ఉండదని..అలాంటప్పుడు అభిమానులు ఇలా వ్యవహరించడం తప్పన్నారు.వినోద్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని..వినోద్ ని హత్య చేసిన వాళ్లకు సరైన శిక్ష పడేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు.