నయన్ మళ్ళీ హ్యాండిచ్చింది.

సౌత్‌లో టాప్ హీరోయిన్ అయిన నయనతారకు.. ప్రమోషన్స్‌కు హ్యాండ్ ఇవ్వడం అనే విషయంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. సినిమాల్లో నటించడం తప్ప.. పబ్లిసిటీ విషయంలో తన పాత్రేమీ ఉండదని అందరికీ తెలుసు. ఈ విషయం ముందే చెప్పేసి మరీ.. అందుకు తగ్గట్లుగానే అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. అలాగే ఈమె డేట్స్ విషయంలో పక్కా క్లారిటీ ఉండాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా అదనంగా అడిగి తీసుకునే అవకాశం ఉండదు.

జాగ్రత్తగా లేకపోతే బాబు బంగారం చిత్రానికి మారుతి టైపులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో అత్యంత కీలకమైన ఆడియో ఫంక్షన్ కు కూడా నయనతార వచ్చే పరిస్థితి లేదు. గత నెలలో జరిగిన బాబూ బంగారం ఆడియో లాంఛ్ కు నయనతార రాలేదు. అందుకే ఆ ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని తీసుకొచ్చి.. మేనేజ్ చేశారు నిర్మాతలు. ఇప్పుడు విక్రమ్ మూవీ ఇంకొక్కడు సంగతి కూడా ఇంతే. ఇంకొక్కడు ఆడియో రిలీజ్ కోసం.. నయనతార బదులు ప్రగ్యా జైస్వాల్ ని పిలిచారు నిర్మాతలు.

ఒక్క హీరోయిన్ హ్యండ్ ఇస్తుండడంతో.. ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేందుకు నిర్మాతలకు ఇతర భామల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా వచ్చినందుకు వాళ్లకెంత ముడుతుందో.. సినిమాకి ప్లస్ అవుతుందని ఎందుకనుకుంటారో తెలీడం లేదు కానీ.. ఆ మూవీతో సంబంధం లేకుండా స్టేజ్ మీద ఉత్సవవిగ్రహాల్లా నుల్చుండి పోవడం తప్ప వీరేమీ చేయలేరు.. మాట్లాడలేరు. మరి ఇలాంటీ రీప్లేస్మెంట్స్‌తో ఉపయోగం ఉంటుందంటారా!!