‘ధృవ’పై తనీ ఒరువన్‌ ఎఫెక్ట్‌ ఎంత?

‘తనీ ఒరువన్‌’ రీమేక్‌గా వస్తోంది ‘ధృవ’ సినిమా. అయితే ఈ సినిమా అనౌన్స్‌ జరిగినప్పట్నుంచీ అందరి దృష్టి తనీ ఒరువన్‌పై పడింది. ఆ సినిమా సీడీలు తెచ్చుకుని ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసేస్తున్నారు. సో ఆ రకంగా ఈ సినిమా స్టోరీ అందరికీ తెలిసిపోయినట్లే.

కానీ సురేందర్‌ రెడ్డి ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి సంబంధించి చాలా మార్పులు చేశాడట. ఆ సినిమాతో పోలిస్తే ‘ధృవ’ సినిమా ఇంకా కొత్తగా ఉంటుందట. అంతేకాదు స్టార్‌ డమ్‌ విషయానికొస్తే తమిళంలో హీరోగా నటించిన జయం రవికి ఉన్న స్టార్‌ డమ్‌ వేరు. ఇక్కడ చరణ్‌కున్న స్టార్‌డమ్‌ వేరు. ఆ రకంగా కూడా ఈ సినిమాపై అంచనాలుంటాయి. ఫైట్స్‌, సాంగ్స్‌, డైలాగ్‌ డెలివరీ ఇలా చాలా విషయాల్లో మార్పులు ఉన్నాయని చెబుతున్నారు సురేందర్‌ రెడ్డి. అయినప్పటికీ ఆ సినిమా చూసిన వాళ్లు ఇంక ఇంతకన్నా చరణ్‌ సినిమాలో ఇంకేం చేసి ఉంటారా. అని ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి ఈ సినిమా చరణ్‌కి కత్తి మీద సామే. అయినప్పటికీ పెద్ద సాహసం చేసి ఈ సినిమాను ఎంతో ఎఫర్ట్‌ పెట్టి చేస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. తమిళంలో హీరోయిన్‌కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ తెలుగులో రకుల్‌ క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉండబోతోందట. ఇంతగా ఆశక్తి కనబరుస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేసే యోచనలో ఉన్నాడు చరణ్‌.