ఒక్క సినిమాతోనే పది సినిమాలు చేసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. పిట్ట కొంచెం, కూత ఘనం అన్న మాట ఆమెకు బాగా సరిపోతుందేమో. సుకుమార్ నిర్మాణంలో రూపొందిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హెబ్బా పటేల్ పేరు తెలుగులో మార్మోగిపోయింది. ఈ భామ ఆ తరువాత ‘ఆడో రకం ఈడో రకం’ అనే సినిమాలోనూ కనిపించి, అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఎంజెల్’గా కనిపించనుంది.
‘ఏంజెల్’ పేరుతో బాహుబలి పళని అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది హెబ్బా పటేల్. సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుందట. నాగ అన్వేష్ కథానాయకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హెబ్బా పటేల్ క్యారెక్టర్ హైలైట్ అవుతుందట. నేటి యూత్కి మంచి మెసేజ్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు బాహుబలి పళని చెప్పారు.
ఈ చిత్రాన్ని నిర్మాత భువన్ సాగర్ తెరకెక్కిస్తున్నారు. లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, మెగా మేనల్లుడు – సుప్రీం హీరో సాయిధరమ్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ మూవీ ప్రారంభోత్సవానికి హాజరయి, చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందజేశారు.