5 వేల మంది సైన్యం,30 కోట్లు క్లైమాక్స్ కే

బాహుబలి ఈ పేరు తెలియని తెలుగువాడుండడేమో.అంతగా పెనవేసుకుపోయిన చిత్రమిది.తెలుగు వాడి సత్తాని ప్రపంచానికి చాటిన చిత్రమిది.ఇప్పటికి బాలీవుడ్ వాళ్ళకి సైతం సవాల్ విసురుతున్న కలెక్షన్ సునామీ మన బాహుబలి.దానికి కొనసాగింపుగా తీస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటికొచ్చిన అది వైరల్ గా మారుతోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో కీలకమైన క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.బాహుబలి మొదటిభాగం లో దాదాపు గంట పాటు క్లయిమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి.దానికోసం దాదాపు 1000 మందిని ఉపయోగించారు.అదే బాహుబలి ది కంక్లూజన్ యుద్ధ సన్నివేశం కోసం ఏకంగా 5000 మందితో చిత్రీకరణ జరుపుతున్నారు జక్కన్న.

ఒక్క ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కే 30 కోట్ల పైగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.ఇంకా ఈ తాజా షెడ్యూల్ లో ప్రభాస్,రానా,రమ్య కృష్ణ,తమన్నా,అనుష్క,సత్య రాజ్ తదితరులంతా పాల్గొంటున్నారు.మొత్తంగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.2017 ఏప్రిల్ లో బాహుబలి ది కంక్లూజన్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.