మహేష్ కి ఫిక్స్ అయిన రకుల్

బ్రహ్మోత్సవం డిసాస్టర్ తరువాత మహేష్ బాబు చేయబోతున్న తదుపరి సినిమా విలక్షణ దర్శకుడు మురుగుదాస్ తోనే అన్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటి వరకు రకరకాలుగా దోబూచులాడింది.మొదట్లో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ని అనుకున్న ఎందుకనో ఆ కంబినేషన్ వర్క్ ఔట్ కాలేదు.ఆ తరువాత రకుల్ ప్రీత్ ని ఒకే చేశారని వార్త వచ్చినా రకుల్ డేట్స్ అడ్జ్స్ అవ్వక నో అన్నట్టు పుకార్లు వినిపించాయి.

అయితే తాజాగా రకుల్ ఈ సినిమాకు ఫైనల్ అయినట్టు పక్కా గా మురుగుదాస్ స్వయంగా ప్రకటించారు,దీనికి కృతజ్ఞతగా రకుల్ కూడా మురుగుదాస్ కి థాంక్స్ చెప్పింది.ప్రిన్స్ తో పెర్ఫెక్ట్ ఫిగర్ గా పేరున్న రకుల్ జోడి అంటే అభిమానులకి కనులవిందే.ఇక ఈ సినిమాకి వెరైటీ టైటిల్ అనుకుంటున్నారని,వాస్కోడగామా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.