పూరి కళ్యాణ్:కిక్ ఎవరికో?

నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన కల్యాణరామ్ ఇటు నటుడిగా అటు నిర్మాతగా తెలుగు సినిమాపై తనదయిన ముద్రవేస్తున్నాడు.బాలనటుడిగా ఎప్పుడో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో తెరంగ్రేటం చేశారు.అయితే ఆ తరువాత పూర్తిగా సినిమాలకి దూరమై చదువుపై శ్రద్ద పెట్టాడు.తిరిగి తనకెంత ఇష్టమైన నటనపై మమకారంతో కల్యాణ్‌రామ్‌ 2003లో ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు.అయితే అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు.మలి ప్రయత్నంగా చేసిన అభిమన్యు కూడా నిరాశపరిచింది.

అయినా నిరాశ పడకుండా ఈ సారి మరో అడుగు ముందుకేసి తాతగారు నందమూరి తారక రామ రావు గారి పేరు మీద NTR ఆర్ట్స్ నిర్మాణ సంస్థని స్థాపించి కొత్త దర్శకుడితో ‘అతనొక్కడే’ సినిమా తీసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.అక్కడి నుంచి ఓ వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా ద్విపాత్రాభినయాన్ని సమర్థంగా నిర్వర్తించి సక్సెస్‌ సాధించారు.

ఈ మధ్యనే కిక్-2 సినిమాను నిర్మించి నిర్మాతగా పరాజయాన్ని చూసిన నటుడిగా పటాస్ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు.తాజాగా పూరి జగన్ దర్శకత్వంలో ‘ఇజం’ అనే చిత్రంలో నటిస్తున్నారు కల్యాణ్‌రామ్‌.ఇందులో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త స్టయిల్ లో కనిపిస్తున్నాడు.ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కళ్యాణ్ రామ్ కి ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూ మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.