చారిత్రకమైన కథలకి తెర రూపం ఇవ్వడంలో యంగ్ డైరెక్టర్ క్రిష్ ముందుంటాడు. రెండో ప్రపంచ యుద్ధ ఘట్టాన్ని వరుణ్ తేజ్ వంటి కొత్త హీరోతో అద్భుతంగా తెరకెక్కించాడంటేనే క్రిష్ గొప్పతనం ఏంటో అందరికీ అర్ధమయ్యింది. ఎంతమంది విమర్శకుల ప్రశంసలనో అందుకుంది ఈ చిత్రం. అలాగే ఇప్పుడు బాలకృష్ణ వంటి సీనియర్ నటుడితో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సెన్సేషన్కు కంకణం కట్టాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.
బాలకృష్ణ కెరీర్లో అద్భుత చిత్రం అయిన ‘ఆదిత్య 369’ సినిమాను ఎప్పట్నుంచో రీమేక్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాదు బాలకృష్ణ 100వ చిత్రంగా ఈ సినిమానే ఎంచుకోవాలనుకున్నాడు కూడా. కానీ క్రిష్ తీసుకొచ్చిన ‘శాతకర్ణి’ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో వెంటనే ఓకే చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం క్రిష్తో పని చేస్తుంటే, ‘ఆదిత్య 369’ సినిమాను టేకప్ చేయగల సత్తా క్రిష్కి మాత్రమే ఉందని డిసైడ్ అయ్యాడట బాలకృష్ణ. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ, కొడుకు మోక్షజ్ఞ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారట. బాలకృష్ణ ‘కృష్ణదేవరాయలుగా కనిపించనున్నారట ఈ సినిమాలో.
ప్రస్తుతం ‘శాతకర్ణి’ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతోన్న మోక్షజ్ఞ, ఈ సినిమాలో నాటి ‘ఆదిత్య 369’ సినిమాలో బాలకృష్ణ పోషించిన ప్రధాన హీరో పాత్రలో కనిపించనున్నాడట. ‘శాతకర్ణి’ సినిమా షూట్ చేస్తూనే, ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా అప్పుడే మొదలెట్టేశాడు క్రిష్ అని తాజా సమాచారం.