క్రిష్‌ కి బాలయ్య బంపర్ ఆఫర్!

చారిత్రకమైన కథలకి తెర రూపం ఇవ్వడంలో యంగ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ ముందుంటాడు. రెండో ప్రపంచ యుద్ధ ఘట్టాన్ని వరుణ్‌ తేజ్‌ వంటి కొత్త హీరోతో అద్భుతంగా తెరకెక్కించాడంటేనే క్రిష్‌ గొప్పతనం ఏంటో అందరికీ అర్ధమయ్యింది. ఎంతమంది విమర్శకుల ప్రశంసలనో అందుకుంది ఈ చిత్రం. అలాగే ఇప్పుడు బాలకృష్ణ వంటి సీనియర్‌ నటుడితో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో సెన్సేషన్‌కు కంకణం కట్టాడు ఈ సెన్సేషనల్‌ డైరెక్టర్‌.

బాలకృష్ణ కెరీర్‌లో అద్భుత చిత్రం అయిన ‘ఆదిత్య 369’ సినిమాను ఎప్పట్నుంచో రీమేక్‌ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాదు బాలకృష్ణ 100వ చిత్రంగా ఈ సినిమానే ఎంచుకోవాలనుకున్నాడు కూడా. కానీ క్రిష్‌ తీసుకొచ్చిన ‘శాతకర్ణి’ కూడా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో వెంటనే ఓకే చేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం క్రిష్‌తో పని చేస్తుంటే, ‘ఆదిత్య 369’ సినిమాను టేకప్‌ చేయగల సత్తా క్రిష్‌కి మాత్రమే ఉందని డిసైడ్‌ అయ్యాడట బాలకృష్ణ. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ, కొడుకు మోక్షజ్ఞ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారట. బాలకృష్ణ ‘కృష్ణదేవరాయలుగా కనిపించనున్నారట ఈ సినిమాలో.

ప్రస్తుతం ‘శాతకర్ణి’ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతోన్న మోక్షజ్ఞ, ఈ సినిమాలో నాటి ‘ఆదిత్య 369’ సినిమాలో బాలకృష్ణ పోషించిన ప్రధాన హీరో పాత్రలో కనిపించనున్నాడట. ‘శాతకర్ణి’ సినిమా షూట్‌ చేస్తూనే, ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్‌ గ్రౌండ్‌ వర్క్‌ కూడా అప్పుడే మొదలెట్టేశాడు క్రిష్‌ అని తాజా సమాచారం.