సూపర్స్టార్ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్కు రాకుండా ఉండేందుకు కేర్ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్నగర్ టాక్.
రజనీకాంత్ లేటెస్ట్ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి తీసుకురావాలని చిత్రబృందం ఆలోచిస్తోందట. ‘కబాలి’ హంగామా అంతా కూల్ అయిన తర్వాత లేటెస్ట్గా థియేటర్స్ను ఓ ఊపు ఊపేయాలని అనుకుంటోందట. ‘గోపాల గోపాల’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వెంకీ చేసిన సినిమా ఇది. తన మూవీ ఎలా ఉండబోతోందో ట్రైలర్ ద్వారానే చెప్పేశారు వెంకీ తనదైన వినోదం గ్యారంటీ అని హింట్ ఇచ్చారు. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార వెంకీతో మరోసారి జోడీ కట్టింది.