భారీ బడ్జెట్‌తో చరణ్ సినిమా?

రామ్‌చరణ్ లీడ్‌లో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ పిక్చర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాకి దాదాపు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. సినిమా నిర్మాణానికి ఈ స్థాయిలో ఖర్చు చేస్తే, ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో ఉండాలి. ఇప్పుడిదే విషయమై నిర్మాతలు చర్చోపచర్చలు సాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం చరణ్-సుకుమార్‌లిద్దరూ ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీగా ఉన్నారు. ‘ధృవ’ షూటింగ్‌తో చరణ్, సుకుమార్ మరో సినిమా విషయంలో తలమునకలై ఉన్నారు. సోదరుడి కుమారుడు అశోక్‌ హీరోగా ‘డైరక్టర్’అనే సినిమాను తెరకెక్కించాలని సుకుమార్ యత్నిస్తున్నారు. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను తన స్నేహితుడు హరిప్రసాద్‌కు అప్పగించాలని అనుకుంటున్నారు. ‘కుమారి 21F’లానే ఈ సినిమా కూడా సుకుమార్ కి కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.