విద్య నిగూఢ గుప్తమగు విత్తము- అన్న భర్తృహరి సూక్తిని తూ.చ. తప్పక నమ్మే పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయకుడు కందాళ ఉపేందర్రెడ్డి.. నియోజకవర్గంలో అన్ని వర్గాల విద్యార్థులకు విద్యను చేరువ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా పాఠశాలలు, కళాశాలల నిర్మాణంపై దృష్టి పెడుతూనే.. మరోవైపు విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఏకంగా కేవలం విద్యపైనే 41 కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చు చేయడం విశేషం. చదువుతోనే విద్యార్థులు తమ […]
Tag: telangana politics
మునుగోడు రాజకీయం మారిందా… ఆ పార్టీకి భారీ నష్టం తప్పదా ..!
ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు కాంగ్రెస్ ఖాళీ అయినట్లేనా..? ఇక అక్కడ ఆ పార్టీ పుంజుకోవడం అసాధ్యమేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. క్యాడర్ ఉన్నా నేతలు హ్యాండివ్వడంతో ఆ లోటును ఇప్పట్లో పూడ్చడం కష్టమేననే అభిప్రాయాలు ఆ పార్టీ నేతలే వెలిబుచ్చుతున్నారు. రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై గత మూడేళ్ల నుంచీ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో తనకు, తన కుటుంబానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. తమను అవమానపరుస్తున్నారని ఆవేదన […]
ఇక్కడ ఎవరు గెలిస్తే నెక్ట్స్ తెలంగాణ సీఎం వాళ్లే…!
ఏపీ, తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికలకు ఇంకా టైం ఉన్నా కూడా అప్పుడే రెండు చోట్ల రాజకీయ వేడి అయితే రాజుకుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని డిసైడ్ చేసేది బీసీ, ఎస్సీ, ఎస్టీలే అవుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కీలకం కానుంది. ఇప్పుడు అధికార ,ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ రిజర్వ్డ్ సీట్లమీద గట్టిగా కాన్సంట్రేషన్ చేయకపోతే అధికారం వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికార […]
నిరుద్యోగులకు షర్మిల బంపరాఫర్…
డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురు తెలంగాణలో పార్టీ (వైటీపీ) ప్రారంభించిన తరువాత కాస్త చురుగ్గానే ముందుకు వెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ కూతురిగా తెలంగాణలో రాజకీయ భవితవ్యం తేల్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన నిరుద్యోగ సమస్యను భుజానెత్తుకున్నారు. నిరుద్యోగులకు బాసటగా ఉంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు సంఘీభావంగా ప్రతి మంగళవారం వారింటి వద్ద దీక్ష చేపడుతున్నారు. ఇపుడు మరో అడుగు […]
ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా బీఎస్పీ పార్టలో చేరారు. ఆయన పార్టీ కండువా ఇలా కప్పుకున్నారో లేదో.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో ఆర్ఎస్పీ (ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) పొలిటికల్ కెరీర్ మొదలైనట్లే. పార్టీలో చేరిన సందర్భంగా ఆర్ఎస్పీ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. దళితులకు కావాల్సింది దళిత బంధు కాదు.. అధికారం అన్నట్లు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని అన్ని పార్టీల నాయకులు […]
ఎస్.. నేనంటే నేనే అంటున్న కేసీఆర్, ఈటల
పేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల నగదు.. ఈ మొత్తంతో దళితులు అభివద్ది చెందుతారు.. అనేక రోజులుగా ఇది నా కల.. ఇప్పటికి ప్రారంభమైంది అని సీఎం కేసీఆర్ చెబుతుండగా.. నేను రాజీనామా చేయడం వల్లే దళిత బంధు వచ్చింది.. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా? రాష్ట్రం మొత్తం ఇవ్వాలి.. ఇది నా క్రెడిట్ అని స్పీచ్ లిస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎవ్వరి వల్ల పథకం వచ్చిందనే విషయం పక్కన […]
మోత్కుపల్లి బీజేపీని వీడేందుకు కారణం దొరికింది
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి.. అక్కడ ఇమడలేక బీజేపీ గూటికి చేరిన సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఇపుడు పార్టీని వీడుతున్నారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇన్ని రోజులు బీజేపీలో తగిన గుర్తింపు లేక సతమతమవుతున్న మోత్కుపల్లి పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటూ ఉన్నారని, అయితే సరైన కారణం చూపకుండా బయటకు వస్తే విమర్శలు వస్తాయని ఇన్నాళ్లూ వెయిట్ చేశారని తెలిసింది. ఇపుడు ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని, భూ […]
అంతే.. కేసీఆర్ ఈజ్ కేసీఆర్.. ఆయన ఎత్తుగడలు ఊహించడం కష్టం..
ఎంతైనా.. కేసీఆర్.. కేసీఆరే.. రాజకీయ ఎత్తులు..పై ఎత్తులు వేయడంలో ఆయనకెవరూ సాటిలేరనే చెప్పవచ్చు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ నాయకుల్లో గులాబీ బాస్ ప్లాన్స్ పసిగట్టడం చాలా కష్టం.. ఆయన తీసుకునే నిర్ణయాలు ఊహకేమాత్రం అందవు. ఏ పథకం ప్రవేశపెట్టినా లబ్ధి పొందేందుకే.. అధికారం కోసమే.. ఈ విషయం దళిత బంధు పథకం ప్రకటించినప్పుడు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కూడా. సీఎం తీసుకున్న మరో నిర్ణయం ఏమంటే.. సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు. దీంతో సింగరేణి […]
కొండా ’చేయి‘ పట్టుకుంటాడా.. కమలం నీడలో ఉంటాడా..
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. సమీకరణాలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తుండటంతో పార్టీలన్నీ తమ బుర్రలకు పదును పెడుతున్నాయి. అక్కడ తమ అభ్యర్థే గెలవాలని అష్టకష్టాలు పడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎత్తుగడ మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తన కేడర్, కేపబిలిటీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇటీవల హుజూరాబాద్ లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ […]