తమిళనాడు సీఎం పీఠంతో బీజేపీ గేమ్!

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు కీల‌క మ‌లుపుతిరిగాయి! ప్ర‌స్తుతం త‌మిళ రాజ‌కీయాలు ఢిల్లీ కేంద్రంగా శాసించ బడుతున్నాయి. ఏరికోరి సీఎం పీఠం ఎక్కాల‌ని క‌ల‌లు క‌న్న శ‌శిక‌ళ కేంద్రంగా ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్లిక‌ట్టు ఆడేస్తోంది! శ‌శిక‌ళ‌ను సీఎం కాదుక‌దా.. ఆ సీటు ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌కుండా ప్లాన్ మీద ప్లాన్ ప్లే చేసేస్తూ.. ఇందిరాగాంధీ హ‌యాంలో వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్‌ను త‌ల‌ద‌న్నేలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. విష‌యంలోకి వెళ్లిపోతే.. త‌మిళ‌నాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జ‌య‌ల‌లిత […]

టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!

అధికార టీఆర్ఎస్‌తో కలిసి అడుగులేయాలా?  లేక పాత ప‌ద్ధ‌తిలోనే టీడీపీతో జ‌త‌క‌ట్టాలా? అనే సందిగ్ధ‌ ప‌రిస్థితి తెలంగాణ బీజేపీ నాయ‌కుల్లో నెల‌కొంది. ఒక‌ప‌క్క సీఎం కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. మరోప‌క్క కేసీఆర్ వైఫల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి ఇలాంటి విభిన్న ప‌రిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తెలంగాణ‌లో ప‌ర్యట‌న హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్‌-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయ‌కుల్లో వ్య‌క్త‌మవుతోంది. టీఆర్ […]

చంద్ర‌బాబుపై మోడీ స్పెష‌ల్ నిఘా

అదేంటి అని ఆశ్చ‌ర్య పోతున్నారా?! పాలిటిక్స్ అన్నాక అంతే! నిత్యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఏదో ఒక సంద‌ర్భంలో పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తే చంద్ర‌బాబుకు ఇప్పుడు అదే మోడీ నిఘాతో చెక్ పెడుతున్నార‌నే టాక్ ఏపీలో వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్లిపోతే.. న‌ల్ల‌ధ‌నంపై పోరు స‌హా ఉగ్ర‌వాదాన్ని క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా ప్ర‌ధాని మోడీ న‌వంబ‌రు 8న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే తొలిసారి స్పందించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. […]

మోడీకి ముస‌ళ్ల పండ‌గ‌కు స్కెచ్ రెడీ

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ పీఎం అయిన‌ప్ప‌టి నుంచి ప్రాంతీయ పార్టీల విష‌యంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేత ధోర‌ణితో వెళుతున్నార‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసే ఉద్దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అణిచివేత విష‌యంలో మాత్రం రాజీప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే మోడీకి అటు ఢిల్లీ, ఇటు బీహార్‌, త‌మిళ‌నాడు, బెంగాల్ ఎన్నిక‌ల్లో చావుదెబ్బ త‌గిలింది. మోడీ ప్రాంతీయ పార్టీల‌ను అణిచివేసి బీజేపీని ఎంత బ‌లోపేతం చేయాల‌ని ప్లాన్లు వేస్తున్నా…చాలా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ప్రాంతీయ పార్టీల‌కే […]

బాబు మోడీని సేవ్ చేస్తాడా..!

ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద స‌మ‌స్య క‌రెన్సీ! కేవ‌లం 0.28% మంది ఉన్న న‌ల్ల కుబేరుల కోసం 99.73% మంది ప్ర‌జ‌లు బ్యాంకుల్లోని త‌మ ఖాతాల్లో జీతాలు, త‌దిత‌ర డ‌బ్బు ఉన్నా.. క‌నీసం ఖ‌ర్చుల‌కు సైతం చేతిలో చిల్లి గ‌వ్వ‌లేక నానాతిప్ప‌లు ప‌డుతున్నారు. ప్ర‌ధాని మోడీ రాత్రికి రాత్రి వెల్ల‌డించిన క‌రెన్సీ స్ట్రైక్స్ న‌ల్ల కుబేరుల మాటేమో కానీ.. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని మాత్రం షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్క‌డ చూసినా… ఏటీఎంల ముందు, […]