రాజకీయ పార్టీలకు మీడియా అండ తప్పనిసరి అయిన రోజులివి. అందుకే ఏదో ఒక పార్టీకి ఏదో ఒక మీడియా.. తన వంతు సాయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చే మీడియానే ఎక్కువగా ఉండగా.. ప్రతిపక్షాన్ని పట్టించుకునే మీడియా ఒకే ఒక్కటి ఉంది. ఈ ఆంతర్యాన్ని తగ్గించేందుకు వైసీపీ నడుం బిగించింది. వైసీపీని ప్రొజెక్టు చేసేందుకు ఆ పార్టీ ఎంపీ రంగంలోకి దిగారు. ఏకంగా ఇప్పుడు ఆయన ఒక చానెల్ను త్వరలో ప్రారంభించబోతున్నారు. […]
Tag: jaganmohanreddy
2019లో ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎంపీలకు నో టిక్కెట్..!
ఏపీలో స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉన్న కడప-కర్నూలు-నెల్లూరు జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ఈ మూడు జిల్లాల్లో కొందరు పార్టీ నేతలపై చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కీలక స్థానాల్లో ఉన్న వారికి సైతం 2019 ఎన్నికల సాక్షిగా షాక్ ఇవ్వక తప్పదని తెలుస్తోంది. కడప జిల్లా కంచుకోటను టీడీపీ బద్ధలు కొట్టడంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ […]
జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన.. కలెక్టర్తో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమవుతోంది. అలాగే ఆయనతో వ్యవహరించిన తీరు ప్రజలతో పాటు పార్టీ నాయకులనే విస్మయానికి గురిచేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ భూషణ్ కూడా జగన్కు షాక్ ఇచ్చారు. జగన్కు ఎన్ని సలహాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోరని.. తన మొండి వైఖరి తనదే […]
వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు డీఎల్
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ నేతృత్వలోని వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా జగన్ చెంతకు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పురందేశ్వరి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత, సీమకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా జగన్ పంచకే చేరుతున్నట్టు అధికారికంగా తెలిసింది. ఈ మాటని స్వయంగా డీఎల్ వెల్లడించడం సంచలనం సృష్టించింది. తాను త్వరలోనే జగన్ పార్టీలోకి చేరుతున్నానని, జగన్ బాటలో నడుస్తానని […]
కోస్తాంధ్రలో వైసీపీ పరిస్థితి బాగాలేదన్న జగన్ వ్యూహకర్త
పార్టీలో సీనియర్లు ఎందరు చెప్పినా.. విశ్లేషకులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు మాట్లాడే వైసీపీ అధినేత జగన్.. తొలిసారి ఒకరి మాట వినబోతున్నాడు. అంతేకాదు ఆయన ఆదేశాల మేరకు తన `రెండేళ్లలో నేనే సీఎం.. ఆరు నెలల్లో నేనే సీఎం.. వచ్చేది మన ప్రభుత్వమే` అనే `పేటెంట్` పదాలను కూడా వదిలేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఎన్నికల కోసం తన ప్రసంగాల పంథాను మార్చుకోబోతున్నాడు. మరి ఈ సలహాలన్నీ ఇచ్చింది మరెవరో […]
జగన్ కు రెండెకరాలిచ్చిన ఘట్టమనేని ఫ్యామిలీ
సొంత రాష్ట్రం ఏర్పడినా.. ఇంకా ప్రధానప్రతిపక్షమైన వైసీపీ హైదరాబాద్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై అటు ప్రజలు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నూతన కార్యాలయ భవనానికి సైలెంట్గా శంకుస్థాపన జరిగిపోయిందని.. పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వం భూమి ఇవ్వడంపై ఎదురుచూస్తున్నామని చెప్పిన జగన్కు.. ఇంత సడన్గా భూమి ఎక్కడ దొరికిందనేది ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ భూమి ప్రిన్స్ మహేశ్బాబు బంధువు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చెందినదిగా తెలుస్తోంది. తనకు చెందిన […]
పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఒకరు దృఢ నిశ్చయంతో ఉంటే.. మరొకరు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి భావి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వ్యూహాలతో మునిగితేలుతూ.. బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరులో పవన్ పర్యటిస్తుండటంతో.. అంతకు ముందుగానే జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో మరోసారి ఆసక్తికర […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]
వ్యూహప్రతివ్యూహాలతో జగన్ సక్సెస్..!
ఏపీలో అధికార, ప్రతిపక్షాల వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాయలసీమ జిల్లాల్లో ఆధిపత్యం కోసం రాజకీయాలు జోరందుకున్నాయి! కడపలో జగన్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుంటే.. కర్నూలు టీడీపీలో అసంతృప్తులకు జగన్ గేలం వేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు జోరందుకున్న తరుణంలో.. కర్నూలుకు చెందిన టీడీపీ నేతలు కూడా జగన్ చెంత చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా కొత్త సమీకరణాలకు తెరతీసింది! రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ప్రతిపక్షనేత సొంత జిల్లా […]