తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం. ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పేశారు. ఈ సారి ఎన్నికలు ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కూడా. అందుకే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే యువగళం పాదయాత్ర చేస్తున్నారు కూడా. దీంతో ఈ ఎన్నికలే డెడ్ లైన్ అన్నట్లుగా టీడీపీ […]
Tag: Ganta sreenivas
ఈ దెబ్బతో గంటా గ్యాంగ్ను బాబు పక్కన పెట్టేయడం కన్ఫార్మ్..!
ఏపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక ఆరోపణ సహజంగానే వస్తోంది. ఇప్పుడు కూడా ఆయన చుట్టూ భూకబ్జా ఆరోపణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన విశాఖ భూ కుంభకోణాలు అన్నీ మంత్రి కనుసన్నల్లోనే సాగిపోతున్నాయట. ఆయన అనుచరులు కొందరు గంటా చెప్పిన ప్రకారం భూములను ఆక్రమించేసి.. వెంచర్లు వేసేస్తున్నారట. దీంతో మంత్రి గారి అవినీతి పుంఖాను పుంఖానులుగా రాజధానిలో హల్ చల్ చేస్తున్నాయి. […]
ఏపీ విద్యాశాఖా మంత్రిగా అనిత..?
మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో మరోసారి కేబినెట్ విస్తరిస్తారో లేదో తెలీదు గాని.. ఈసారి మాత్రం చాలా మంది `మంత్రి` ఆశలు పెట్టేసుకున్నారు. `ఇదే ఎన్నికల టీం` అని సీఎం చంద్రబాబు కూడా ప్రకటించేశారు. గతంలో మంత్రి ఆశించి తీవ్రంగా భంగపడిన వారిలో ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసో డ్తో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన ఆమె.. మంత్రి పదవిపైనే చాలా ఆశలు పెట్టేసుకున్నారు. అయితే సమీకరణాల నేపథ్యంలో ఆమెకు దక్కలేదు. […]
గంటాను వదిలించుకుంటోన్న బాబు
ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైలే వేరు. ఆయనకు ఒకే పార్టీలో ఉండి రాజకీయాలు చేయాలన్న సూత్రం ఏదీ ఉండదు. ప్రతి ఎన్నికకు ఒక్కో పార్టీ మారే గంటా, కొత్త చొక్కా మార్చినంత సులువుగా నియోజకవర్గాలు కూడా మార్చేస్తుంటాడు. గంటా పలు పార్టీలు మారి గత ఎన్నికలకు ముందు తన టీంతో కలిసి టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ ఒప్పందం ప్రకారం ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి గంటాకు జిల్లాలో […]
విశాఖ కుంభకోణాన్ని పక్కదోవ పట్టించేశారా?
విశాఖ భూ కబ్జా వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి మధ్య వివాదంగా మారింది. ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. భూకుంభకోణం గురించి ప్రజలు ఆలోచించకుండా.. దానిని నీరుగారే ప్రయత్నం జరుగుతోందనే చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న సమయంలో.. అయ్యన్నపై మంత్రి గంటా లేఖ […]