కరోనా వైరస్.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మళ్లీ ఈ మహమ్మారి పేరే వినిపిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రజలను, ప్రభుత్వాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకెందరో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా వైగంలో జోరు తగ్గడం లేదు. దీంతో చేసేదేమి లేక పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం కూడా […]
Category: Politics
బెంగాల్లో ఓవైసీ పార్టీకి ఝలక్..!
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతున్నది. బీజేపీ పోటీ ఇచ్చినా మెజార్టీ సాధించలేకపోతున్నది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 292 స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికలను నిర్వహించింది. ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 98 సీట్లలో లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా […]
సాగర్లో విజయం దిశగా టీఆర్ ఎస్..!
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. విజయం దిశగా పయనిస్తున్నది. కారు దూకుడుకు విపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్లోనూ గులాబీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నది, టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమైనట్లుగా తెలుస్తున్నది. వరుసగా తొలి ఎనిమిది రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. ఏడో రౌండ్ ముగిసే సరికి 6,592 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. ఎనిమిదో […]
ఓటమి దిశగా కేంద్ర మంత్రి.. 200 ఆధిక్యంలో డిప్యూటీ సీఎం
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మహమహులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇప్పటికే టీఎంసీ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. మొత్తంగా 161 స్థానాల్లో ముందంజలో ఉన్నది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మొత్తంగా ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో మొత్తంగా టీఎంసీ 51శాతం సాధించగా, 35శాతం ఓట్లను మాత్రమే సాధించడం గమనార్హం. ఇదిలా సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. మూడు […]
అగ్రనటులు ముందజ.. ఖుష్బూ వెనుకంజ
ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయగా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సారథ్యంలోని కూటమి […]
సాగర్ నాల్గవ రౌండ్ లో ఎవరు టాప్ అంటే..?
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ దూసుకుపోతున్నారు. వరుసగా తొలి నాలుగు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 3,457 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 3421, […]
తిరుపతి ఉప ఎన్నిక..పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం!
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నేడు రానున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేటి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. తిరుపతి లోక్సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల […]
నందిగ్రామ్లో వెనకబడిన మమత..!
దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైనే ఉన్నాయి. అక్కడ ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగాయి. బీజేపీ, టీఎంసీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల మధ్య స్వల్ప సంఖ్యలోనే తేడాలు ఉండడంతో మరింత ఉత్కంఠత రేపుతున్నది. మొత్తంగా 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర కాక రేపుతున్నాయి. క్షణం క్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఆది నుంచి టీఎంసీ […]
తమిళనాడులో జోరుగా కౌంటింగ్..వార్ వన్సైడ్ చేస్తున్న డీఎంకే కూటమి!
తమిళనాడు రాష్ట్రంలో ఎవరు సీఎం పీఠం ఎక్కించబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కొద్ది సేపటి క్రీతమే కౌంటింగ్ ప్రారంభం కాగా.. మరి కొన్ని గంటల్లో ఫలితాలపై స్పష్టత రాబోతుంది. తమిళనాడులో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(దినకరన్ పార్టీ) గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. అలాగే సినీ నటుడు కమల్హాసన్ కూడా మకల్క నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి.. బరిలోకి దిగారు. అయితే వార్ […]









