యంగ్టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ ప్రి రిలీజ్ బజ్ అదిరిపోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన జై క్యారెక్టర్ టీజర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇదిలా ఉంటే జై లవకుశ ఓవర్సీస్ రైట్స్ను హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మాతల్లో ఒకరు అయిన సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
జై లవకుశ యూఎస్ రైట్స్ కోసం వారు రూ 10.5 కోట్లు కోట్ చేయగా నిర్మాత కళ్యాణ్రామ్ వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తోంది. మహేష్ స్పైడర్ తెలుగు+తమిళ్ కలిపి రూ 15.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన జై లవకుశకు కేవలం తెలుగు వెర్షన్ రైట్స్కే రూ 10.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు.
ఇక ఈ సినిమా సింగపూర్ రైట్స్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ 18 లక్షలకు కోనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యానర్ కళ్యాణ్రామ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, నార్త్ ఇండియాల్లో అంచనాలకు మించి ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతుండడంతో నిర్మాత కళ్యాణ్రామ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.