డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఇందుకు తగ్గట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో ఉన్న ఎవ్వరినీ విడిచిపోట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో కలకలం మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం.. టార్గెట్ చేసిందని సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ఆవేదన చెందుతున్నారట. ఇదే తరుణంలో ఏపీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సినీ పరిశ్రమ వైపు వీరి దృష్టిప డిందని సమాచారం. ముఖ్యంగా ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణానికి చిరునామాగా ఉన్న విశాఖకు తరలిపోతే ఎలా ఉంటుందనే ఆలోచనలో సినీపెద్దలతో పాటు సాంకేతిక నిపుణులు ఉన్నారట.
రాష్ట్ర విభజన సమయంలో అన్ని పరిశ్రమలు ఏపీకి తరలివచ్చిన సమయంలో.. సినీ పరిశ్రమ కూడా వెళిపోతుందని అంతా భావించారు. కానీ సినీ పరిశ్రమ మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయింది. విశాఖలో సినీపరిశ్రమ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నందున.. సరైన సదుపాయాలు లేవని కొందరు వెనకడుగు వేశారు. అయితే ఇప్పుడు మళ్లీ సినీ పరిశ్రమలోని కొంతమంది విశాఖ వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. మొన్న పూరీ జగన్నాథ్, నిన్న శ్యామ్ కె నాయుడు, తర్వాత సుబ్బరాజు.. ఆ తర్వాత చార్మీ.. ఇలా ఒక్కొక్కరు సిట్ ముందు విచారణకు హాజరువుతున్నారు.
ఇంకా ఎంతో మంది, త్వరలో మరింత మంది పేర్లు బయటికి వస్తాయని ఊహాగానాలు వస్తుండటంతో టాలీవుడ్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఇలా అందరూ డ్రగ్ రాకెట్ సూత్రధారులతో పరిచయమున్న ఏ ఒక్కరినీ వదలబోమని చెబుతున్నారు. ఈ వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలే లేవని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ విశాఖపట్టణానికి తరలిపోనుందనే వర్గాలు ఊపందుకున్నాయి, ఇక్కడ కేసీఆర్ సర్కార్ టార్గెట్ ఎక్కువవ్వడంతో టాలీవుడ్లోని కొందరు పెద్దలు, సాంకేతికి నిపుణులు ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి వెళ్లిపోవాలని చూస్తున్నారన్నట.
సినిమాలు, షూటింగ్లతో బిజీబిజీగా గడిపే ఆర్టిస్టుల్లో ఇప్పుడు డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. సినిమాల్లో ట్విస్టుల్లానే ఎప్పుడు ఎవరి పేరు బయటికొస్తుందోననే టెన్షన్ ప్రతి ఒక్కరిలో మొదలైంది. ఈ డ్రగ్స్ రాకెట్ లో ఎవరున్నారో లేదో తెలియదు కానీ.. ఆరోపణలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. దీంతో.. ఇండస్ట్రీలో కూడా కుదుపులు ఖాయమన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ… చాలామంది విశాఖ ఫ్లైట్ ఎక్కేందుకు ముహూర్తం చూసుకుంటున్నారనీ తెలుస్తోంది. కొన్ని రోజులు ఆగితే.. ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.