హైదరాబాద్లో కొద్ది రోజుల క్రితం బయటపడిన డ్రగ్స్ ముఠాకు టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులకు లింక్ ఉందని వార్తలు రావడం పెద్ద కలకలం రేపుతోంది. ఈ కేసును విచారిస్తోన్న పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిసినట్టు తెలుస్తోంది. ఈ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం టాలీవుడ్లో పలువురికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు యంగ్ హీరోలు.. ఒక స్టార్ హీరోయిన్, మరో మీడియం రేంజ్ హీరోయిన్, ముగ్గురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లు, ఒక కొరియోగ్రాఫర్, ఒక స్టంట్ మాస్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఆరు రోజుల్లో ఎప్పుడైనా విచారణకు సిద్ధంగా ఉండాలని కూడా వీరికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నారట.
ఈ ముఠాకు టాలీవుడ్కు లింక్ ఉన్నట్టు వార్తలు రావడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్బాబు ఏకంగా ప్రెస్మీట్ పెట్టి వారికి వార్నింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. టాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు ఇలా మొత్తం 15 మంది టాప్ పొజిషన్లో ఉన్న వారు వీటికి విపరీతంగా బానిస అయినట్టు తెలుస్తోంది.
ఇక ఈ లిస్టులో ఓ స్టార్ హీరోయిన్ పేరు ఉండడం ఇప్పుడు అందరికి షాక్ ఇస్తోంది. ఆమె టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ హీరోల పక్కన నటించి పలు హిట్లు కొట్టింది. ఇప్పుడు ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ హీరోయిన్ పేరు బయటకు రాకపోయినా ఆమెది పంజాబ్ అన్న పేరు కూడా బయటకు వచ్చింది. దీనిని బట్టి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో అందరికి అర్థమైంది.
ఆమెకు టాలీవుడ్లో బడా ఫ్యామిలీ హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆమె పేరు బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది. ఆమె తరచూ డ్రగ్స్ మత్తులో జోగుతోన్నట్టు కూడా తెలుస్తోంది. ఆమె ఓ బడా ఫ్యామిలీ హీరోకు దగ్గరై వీటికి బానిస అయినట్టు సమాచారం.