ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధారణం అనదగిన పరిణామాలు వెంటవెంటనే చోటు చేసేసుకుంటున్నాయి. తన మామకు వెన్నుపోటు పోడిచాడు అని విపక్షాలు సీఎం చంద్రబాబును తరచు విమర్శిస్తూ ఉంటాయి. దీనిని పక్కన పెడితే.. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నేరుగా చంద్రబాబుకు అనుభవంలోకి వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో బాబు అవాక్కయిపోవడం తరువాయి అయింది. నిజానికి ఈ పరిణామం ఏ కమ్మ, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మరో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మణ కులం నుంచి అందునా ఓ మాజీ ఐఏఎస్.. అది కూడా బాబుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుబడ్డ మాజీ ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు నుంచి ఎదురు కావడం ఇప్పుడు భారీ న్యూస్ అయింది.
విషయంలోకి వెళ్తే.. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును సీఎం చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారు. ఆయన రిటైర్ కాగానే.. కేబినెట్ హోదాతో బ్రాహ్మణ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు. అయితే, కృష్ణారావు గత కొద్ది రోజులుగా ఏపీ సర్కార్ చర్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పదే పదే పోస్టింగులు పెడుతున్నారు.
ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడుతుంటే వాటిని సైతం తన వాల్ మీదకు షేర్ చేస్తున్నారు. అదేంటని ఎవరైనా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే నాది కరెక్ట్ అని నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇస్తున్నారు. ఈ పరిణామాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. వెంటనే ఆయన ను పదవి నుంచి దింపేయాలని ప్రెపోజల్ పెట్టాయి. దీంతో బాబు ఆయన స్థానంలో మరొకరిని నియమించేశారు.
ఇక ఇప్పుడు ఐవైఆర్ ఎందుకలా చేశారు? ఎందుకిలా బాబుకు వెన్నుపోటు పొడిచారు.? అని ప్రతి ఒక్కరిలోనూ ప్రశ్నలు వస్తున్నాయి. కృష్ణారావు మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి బ్యాచ్కు చెందినవాడు. ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాది. జగన్తో ఇంటర్నల్గా ఎప్పటి నుంచో సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనిట్రై చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయనకు మధ్యవర్తిగా జగన్పార్టీలో చేరాలని సలహా ఇవ్వడం, విజయవాడ సెంట్రల్ సీటు ఇప్పించేలా హామీ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ సెంట్రల్ సీటులో బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు సునాయాశంగా గెలుస్తారనే నమ్మకం ఉండడం ఐవైఆర్ ఇలా ప్లేట్ ఫిరాయించారని సమాచారం. మొత్తానికి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా మారింది సీన్!!