టాలీవుడ్ ప్రిన్స్ మహేష్బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్బాబు – మురుగదాస్ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై సౌత్ టు నార్త్ లాంగ్వేజెస్ల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
షూటింగ్ ఫైనల్ స్టేజ్కు చేరుకున్న ఈ సినిమాలో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నా ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకపోవడంతో అందరూ ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరో సరికొత్త న్యూస్ బయటకు వచ్చింది.
స్పైడర్ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఉండేందుకు బడ్జెట్ మరో రూ.10 కోట్లు పెంచారట. బాహుబలి సినిమాకు వర్క్ చేసిన మకుట సంస్థే స్పైడర్ విజువల్స్ చూస్తోందట. ఈ రూ. 10 కోట్లతో కలుపుకుంటే స్పైడర్ బడ్జెట్ మొత్తం రూ.130 కోట్లకు చేరింది. దీంతో సౌత్ ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల సరసన స్పైడర్ సినిమా కూడా చేరిపోయింది.