టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి ఎంతో మంది అగ్రహాల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న అనుమానాస్పదంగా కన్నుమూయడం జరిగింది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ కి వెళ్లిన ఈమె అక్కడ ఒక హోటల్లో బాత్ టబ్ లో మునిగిపోయి మరణించినట్లుగా వార్తలు వినిపించాయి.
ఈ వార్త ఇప్పటికి సినీ పరిశ్రమను,అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.అయితే చాలా ఏళ్ల తర్వాత శ్రీదేవి మరణం పై ఆమె భర్త బోణికపూర్ ఘాటుగా స్పందించారు. చాలా ఏళ్లుగా ఈ విషయం పైన విచారణను ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే శ్రీదేవి మృతికి గల కారణాలను కూడా ఆయన వివరించడం జరిగింది.. ఒక ఇంటర్వ్యూలో బోణికపూర్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి మరణం సహజమైనది కాదు ఇది ప్రమాదవశాత్తు జరిగింది విచారణలో నేను 48 గంటల పాటు మాట్లాడాను అని తెలిపారు.
అందుకే ఇకమీదట మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను భారతీయ మీడియా నుంచి చాలా ఒత్తిడి ఉన్నందువలన వారికి ఈ విధంగా వివరించాలని కోరుతున్నాను.. ఆమె పైన హత్యాయత్నం జరగలేదని తెలిపారు.. నేను లై డిటెక్టర్ తో పరీక్షతో సహా అన్ని పరీక్షలు చేయించుకున్నాను.. చివరకు రిపోర్టులో అది ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు బోణికపూర్.. శ్రీదేవి అందంగా కనిపించేందుకు డైట్ చేస్తూ ఉండేది వాటివల్లే ఆమె మరణించి ఉండవచ్చని బోణికపూర్ తెలిపారు. శ్రీదేవి ఎక్కువగా పస్తులు ఉండేది స్క్రీన్ పైన అందంగా కనిపించడానికి తన బాడీ షేప్ తో ఉండాలని కోరికతోనే ఇలా డైట్ పాటించేది. ఈ కారణంగానే ఎన్నోసార్లు స్పృహతప్పి పడిపోయింది అని తెలిపారు. ఉప్పులేని ఆహారం తీసుకోవడం వల్ల ఈమెకు చాలా సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు.. శ్రీదేవి మరణం మాత్రం దురదృష్టకరమని తెలిపారు.