బిగ్ హింట్ ఇచ్చిన నాగార్జున.. వైల్డ్‌ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వీళ్లే..!

బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి రసవతరంగా కొనసాగుతుంది. సీజన్ సిక్స్ ఫ్లాప్‌ అవడంతో ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో ఈ సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. బిగ్‌బాస్ మొదటి నుంచే కంటెస్టెంట్ల మధ్యలో గొడవలు పెడుతూ కష్టతరమైన టాస్కులతో షోపై మొదటి నుంచి ఆసక్తి పెంచేశాడు. అయితే ఈ షో మొదలైనప్పటి నుంచి ఉల్టా పల్టా అంటూ నాగార్జున చెప్పడంతో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పల్టా అంటే ఇదే అంటూ అనేక రకాల న్యూస్ లు వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన వార్తలు అన్నిట్లో ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అయింది.

తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ లంచ్ 2.0 ఉండబోతుందంటూ న్యూస్ వైరల్ అవ్వడంతో ప్రతి ప్రతి ఒక్కరు ఆ లాంచ్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున నోటి నుంచే నేరుగా ఆ హింట్‌ రావడంతో మళ్లీ గ్రాండ్ లాంచ్ కచ్చితంగా ఉంటుందని అర్థమైపోయింది. అక్టోబర్ 8న లాంచ్ ఉండబోతుందని చెప్తున్నారు. అందుకోసం ఇప్పటికే కంటిన్యూస్టెంట్లు కూడా రెడీ అయ్యారట. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గ్రాండ్ లాంచ్ తో ఐదుగురు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.

అంబటి అర్జున్, అంజలి పవన్, పూజ మూర్తి, గోలి షావలి, నైనీ పావని వీళ్ళు ఐదుగురు ఈ సెకండ్ లాంచ్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట‌. వీళ్ళ పేర్లు ఉన్నా లేకపోయినా గ్రాండ్ లాంచ్ మాత్రం కచ్చితంగా ఉంటుందట. అయితే ఇప్పటివరకు బిగ్‌బాస్ సీజన్ 7 పై వచ్చిన రూమర్స్ దాదాపు నిజమయ్యాయి. ఇప్పుడు వచ్చే ఈ రూమర్ కూడా నిజమైతే షో మ‌రింత ఆసక్తిగా ఉంటుంది అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు