మహేష్ బాబు కుటుంబం 2023 వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సితార దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నమ్రత తన పిల్లలు గౌతమ్, సితార వినాయక నిమజ్జనంలో పాల్గొన్న వీడియోను కూడా షేర్ చేశారు. వినాయక చవితి నిమజ్జనం రోజున, మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ తమ ఇంట్లోని వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
గౌతమ్ గణనాథుడి విగ్రహాన్ని ఎత్తుకొని ముందు నడవగా, సితార, పనివాళ్ళు వెనుక నడిచారు. అనంతరం సితార, గౌతమ్ ఇద్దరూ కలిసి తమ ఇంటి పెరట్లో ఏర్పాటు చేసిన డ్రమ్ములో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, నమ్రత పాల్గొనలేదు.
ఈ వేడుకల వీడియోను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడది వైరల్ అవుతోంది. గౌతమ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్నాడు. అలాగే సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. సితార, గౌతమ్ వినాయక చవితి పండుగ రోజున సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. గౌతమ్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి చాలా కేర్ తీసుకున్నాడు. అతను విగ్రహాన్ని నీటిలోకి వదిలే ముందు దానికి ప్రార్థనలు చేశాడు.
View this post on Instagram
చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. వారి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇకపోతే 17 ఏళ్ల గౌతమ్ ఘట్టమనేని, మహేష్ బాబు, నమ్రతల పెద్ద కొడుకు. అతను 2014లో మహేష్ బాబు చిత్రం 1: నేనొక్కడినేలో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు. క్రికెట్పై కూడా ఆసక్తి ఉన్న అతను హైదరాబాద్ అండర్-14 జట్టుకు ఆడాడు. 11 ఏళ్ల సితార ఘట్టమనేని, మహేష్ బాబు, నమ్రత దంపతుల చిన్న కూతురు.
ఆమె ప్రముఖ సోషల్ మీడియా స్టార్. ఆద్య & సితార అనే తన సొంత యూట్యూబ్ ఛానెల్ని కలిగి ఉంది, ఇక్కడ ఆమె దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె అయిన తన బెస్ట్ ఫ్రెండ్ ఆద్యతో వీడియోలను పోస్ట్ చేస్తుంది. ఇక మహేష్ బాబు చివరగా సర్కారు వారి పాటలో కనిపించాడు. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ కీర్తి సురేష్తో కలిసి నటించాడు.